DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదేళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమే, రానున్నది అర్దిక్ విప్లవమే: మోడీ 

*ఎన్నికల తర్వాత మీకు చేతినిండా పని: ఆర్బీఐ తో ప్రధాని వెల్లడి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 04, 2024 : (డి ఎన్ ఎస్):* పదేళ్ల కాలం లో ఆర్థిక రంగంలో చూసింది ఒక ట్రైలర్ మాత్రమేనని, ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే ఆర్థిక విప్లవం మొదలవుతుందని  నరేంద్ర మోడీ

ప్రకటించారు. ముంబై లో జరిగిన భారత రిజర్వ్ బ్యాంకు 90 ఏళ్ళ వేడుకల్లో బ్యాంకింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న పదేళ్లలో ఒక ఆర్థిక అభివృద్ధి విప్లవం చూపిస్తామని తెలిపారు. ప్రపంచ ఆర్ధిక పటంపై భారత్ ను అగ్రగామిగా నిలపవలసిన భాద్యత మెదేనన్నారు. 

రానున్న 100 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని,

అంతవరకూ మంచి ఆలోచనలు చేయండన్నారు. రెండో రోజు నుంచే ఊపిరి సలపని ప్రాజెక్ట్ మీకు అప్పగిస్తామన్నారు. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉంచి, ఆదయ వనరులను విస్తృతంగా పెంచుకుందామన్నారు. ప్రస్తుత యువత ఎంతో ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నారని, వారికి సంపూర్ణ అవకాశాలను అందించేందుకు ఆర్ధిక వ్యవస్థ సిద్ధంగా ఉండాలన్నారు. వాళ్ళ

ప్రస్థానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్తాం. దానిలో ఆర్బీఐ సహకారం అవసరం అన్నారు. 
దేశ వ్యాప్తంగా సంప్రదాయ సౌర శక్తి ద్వారా విద్యుఛ్చక్తి ని ఉత్పత్తి చేసుకునే విధంగా వనరులను పూర్తిగా అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా దృష్టి సారించామన్నారు. దానికి తగిన ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఆర్థిక రంగంలో ఏఐ (

ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్) విధానాన్ని పూర్తిగా వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులకు సూచించారు.   
ఇప్పడికే 5 జి నెట్వర్క్  పై దృష్టి పెట్టామని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ( ఎంఎస్ ఎం ఈ ) అభ్యున్నతి కోసం వివిధ మార్గాల్లో క్రెడిట్ గ్యారంటీ విధానం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి.

అయోధ్య

ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గా మారనుంది. కోట్లాది రూపాయల లావాదేవీలు అన్ని రంగాల్లోనూ జరుగనున్నాయి. 

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam