DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొత్తులపై బీజేపీ వైఖరి: ఒడిశా లో ఉన్నతం - ఏపీలో ఊడిగమా?

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 07, 2024 (డి ఎన్ ఎస్):* భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అగ్రభాగం లో ఉంటె. .ఆంధ్ర లో ఊడిగం చేస్తూ దిగజార్చేలా తయారయ్యింది అనడానికి ఒడిశా ఘటనే నిదర్శనం అని సంప్రదాయ బీజేపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.  
ఎన్నికల్లో భాగంగా

ఒడిశాలో కేవలం రెండు సీట్ల కోసం బీజేడీ తో పొత్తు వద్దు అని ఒడిశా శాఖ ఖరాఖండిగా తేల్చిచెప్పేసింది. కేంద్ర బీజేపీ అగ్రనేతలు చెప్పినా సరే. . బీజేడీ తో పొత్తు మాకు అక్కరలేదు అని ఒడిశా బీజేపీ శాఖా చెప్పేసింది. భుబనేశ్వర్, పూరి లోక్ సభ  సీట్లు ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వీటిని తమకే కావలి అని బీజేపీ ఒడిశా శాఖా

పట్టుపట్టింది. అయితే ఇవే సీట్లు తమకి కావాలి అని బీజేడీ కూడా అడగడంతో కేంద్ర బీజేపీ అధిష్టానం ఒడిశా శాఖ తో సమావేశం పెట్టి ఈ సీట్లు బీజేడీ కి ఇస్తున్నట్టు ప్రకటించింది. దాంతో ఒడిశా బీజేపీ నేతలు ఈ సీట్లు తాము వదులుకునేది లేదని తేల్చి చెప్పి, తాము ఒంటరి పోరాటమే చేస్తామని ప్రకటించేశారు. దీంతో కేంద్ర బీజేపీ

చేతులెత్తేసింది. నేడు రెండు పార్టీలు ఒంటరిగానే బరిలో ఉన్నాయి. 
  
దీనికి పూర్తి భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ శాఖా ను ఊడిగం చేస్తూ దిగజార్చేసారని క్యాడర్ మండిపడుతున్నారు. సొంతంగా గెలిచేంత ఓటు బ్యాంక్ లేకపోయినా. . అభిమానులు మాత్రం ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. వీళ్లందరి మనోభావాల్ని భూస్థాపితం చేస్తూ

పొత్తుల పేరుతొ ఆంధ్ర బీజేపీ మొత్తం శాఖని ఎదుటి పార్టీకి తాకట్టు పెట్టేశారని మండిపడుతున్నారు. సొంతంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్న స్థానాలను సైతం వదిలేసుకొని, ఎదుటి పార్టీ దయాదాక్షిణ్యాలకు మొత్తం రాష్ట్ర వ్యాప్త సంప్రదాయ బీజేపీ క్యాడర్ ను బలిచేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుటి పార్టీకి పనికిరాని సీట్లను వాళ్ళే

నిర్ణయించి, ఈ సీట్లు మీకు అని అంటే ఏపీ బీజేపీ కమిటీ నోరెత్తకుండా తీసుకున్న ఘనులు అన్నారు.  

ప్రస్తుతం టికెట్లు పొందిన వాళ్ళల్లో ఎంతమంది బీజేపీ పూర్తి స్థాయి కార్యకర్తలు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల్లో గుర్తింపు లేనివాళ్లు, ఈడీ కేసులు, ఐటి దాడులకు భయపడిన వాళ్ళు, బీజేపీ లో చేరడమే

కాక అధిష్ఠానం వల్ల లాబీ చేసి బీజేపీ ఒరిజినల్ క్యాడర్ ను అణగద్రొక్కేశారని మండిపడ్డారు. అయితే వీళ్ళెవ్వరి కేసులూ ఇంకా ముగియలేదని, కేవలం లాబీ వల్లే సీట్లు పొందారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్ర స్థాయి లో వలస వాదులే ఆధిపత్యం చెయస్తూన్నారని, తద్వారా సంప్రదాయ కార్యకర్తలు పార్టీ వీడి  వెళ్లిపోయే

స్థితి వచ్చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ అభ్యర్థుల్లో ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఇదే పార్టీలో కొనసాగుతారన్న గ్యారంటీ లేదన్నారు. 
 
ఒడిశా లో కేంద్ర పార్టీని సైతం నిలదీయగలిగే స్థాయి లో ఉంటె. .ఆంధ్ర లో మాత్రం పూర్తిగా ఊడిగం చేస్తూ దిగజార్చేసారని  మండిపడుతున్నారు. దీనికి నిదర్శనమే కొన్ని చోట్ల నిరసనలు

వ్యక్తం అవుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam