DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అఫిడవిట్ లో లేని ఆస్తులు ఈసీ స్వాధీనం చేసుకోవాల్సిందే 

ఒళ్ళు మండిన ఓయూ యువత ప్రచారం తో రాజకీయ పార్టీలకి చాకి రేవే 

హైదరాబాద్, నవంబర్ 20 , 2018 (డిఎన్ఎస్ DNS Online ) :  à°…à°–à°‚à°¡ భారత దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా విద్యావంతులు తమ

మెదడు కు పని చెప్పారు. తెలంగాణ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులకు గట్టి గుణపాఠం చెప్పనున్నారు. ఎన్నికల దరఖాస్తుతో

పాటు ఎన్నికల కమిషన్ కు అందించే అఫిడవిట్ లో అభ్యర్థులు ప్రకటించే ఆస్తుల వివరాలను (మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తి) మాత్రమే వారికి ఉంచి, మిగిలిన ఆస్తులన్నింటినీ

ఎన్నికల కమిషన్, ఐటి విభాగాలు, ఈడీ లు స్వాధీనం చేసుకోవాలి అనే డిమాండ్ చేస్తున్నారు. వీరు గత నెల ఓయూ లో జరిగిన సర్వ సభ్య సమావేశం లో ఈ విధమైన తీర్మానం చేశారు.

దీనికి బద్ధులై, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ సైతం చేశారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల వారీగా బృందాలు విడిపోయి,

ప్రతి నియోజకవర్గం లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా వీరు ప్రచారం చెయ్యనున్నారు. రాజకీయ పార్టీలు ప్రతీ ఎన్నికల సమయంలోనూ విచ్చలవిడి

హామీలు ఇస్తున్నాయని, గత ఎన్నికల్లో కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో తెలంగాణ మొత్తం యువత టీఆరెస్ కు ఓట్లు వేసి గెలిపించారని, అయితే అధికారం

లోకి వచ్చాక కేసీఆర్  à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°— యువతను మోసగించారన్నారు. దీంతో అలీబాబా లాంటి కేసీఆర్, అతని నలభై దొంగలకు గట్టి గుణపాఠం చెప్పాలని, అదే విధంగా మిగిలిన రాజకీయ

దొంగలకు కూడా ఇది ఒక చెంప దెబ్బగా ఉండాలని, ప్రచారం చేస్తున్నామన్నారు. మహా కూటమికి కూడా ఇదొక హెచ్చరికగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో ఈ ప్రచారాన్ని

విస్తృతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రచారం à°ˆ నెల 22 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #hyderabad  #osmania university  #telangana  #TRS  #affidavit  #campaign 

#elelctions  #students; 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 26, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam