DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుంభమేళా కి వచ్చే ఆదాయం 1 .2 లక్షల కోట్లు : సిఐఐ అంచనా 

ఆతిధ్యం, విమాన, ట్రావెల్, టూరిజం, మెడికల్, టాక్సీ, గైడ్స్ రంగాల్లో 5.85  à°²à°•à±à°·à°² మందికి ఉపాధి, 
 

ప్రయాగ్ రాజ్, జనవరి 20 ,2019 (DNS Online ): భారత దేశంలో ఆర్ధిక వ్యవస్థ కు అండగా

నిలిచే భారత పరిశ్రమల శాఖ (సిఐఐ) ప్రకటించిన అంచనాల ప్రకారం ప్రయాగ్ రాజ్ లో ప్రస్తుతం జరుగుతున్న అర్ధ కుంభ మేళా లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వ్యాపార సంస్థల

ద్వారా అక్కడ జరిగే వ్యాపార లావాదేవీల విలువ అక్షరాలా 1 లక్ష 20 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ప్రకటించింది. ఈ అర్ధ కుంభమేళా కేవలం హిందూ సమాజ విలువలు,

సంప్రదాయాలకు మాత్రమే సంబంధించిందని, అయినప్పడికీ వివిధ వర్గాలకు చెందిన వ్యాపారస్తులు ఇక్కడ హిందూ సంప్రదాయ వస్తు, సామాగ్రి విక్రయాలతో పాటు, వసతి, రవాణా, భోజన

తదితర అన్నిరకాల వ్యాపారాలు నిర్వర్తిస్తున్నారని ప్రకటించింది. జనవరి 15న ప్రారంభమైన ఈ మెగా మేళా మార్చి 4 వరకు కొనసాగనుంది. వివిధ రంగాల్లోని ఆరు లక్షల

మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నదని సీఐఐ తెలిపింది.

50 రోజుల కుంభమేళా నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.4200 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2013లో జరిగిన మహా

కుంభమేళా కంటే మూడు రెట్లు ఎక్కువ నిధులను ఈసారి ఇవ్వడం విశేషం.

ఆతిథ్య à°°à°‚à°—à°‚ 2 లక్షల 50 వేల మందికి, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్. లక్షా 50 వేల మందికి, టూర్

ఆపరేటర్స్ 45 వేల మందికి, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలో 85 వేల మందికి ఈ కుంభమేళా ఉపాధి కల్పిస్తున్నట్లు సీఐఐ అధ్యయనం వెల్లడించింది.

ఇది కాకుండా అసంఘటిత

రంగంలో టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్స్, వలంటీర్లు, ఇంటర్‌ప్రిటర్స్ రూపంలో మరో 55 వేల ఉద్యోగాలు వచ్చినట్లు సీఐఐ చెప్పింది. ఇవన్నీ ప్రభుత్వ ఏజెన్సీలు, వ్యాపారుల

ఆదాయాన్ని భారీగా పెంచినట్లు తెలిపింది.

అంతేకాదు ఈ కుంభమేళాకు ఆస్ట్రేలియా, యూకే, కెనడా, మలేషియా, సింగపూర్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే,

శ్రీలంకల నుంచి భారీ ఎత్తున విదేశీయులు కూడా వచ్చారు. ఈ భారీ ఆదాయం ద్వారా ఉత్తరప్రదేశ్ ఒక్కటే కాకుండా రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్

రాష్ట్రాలు కూడా లబ్ధి పొందనున్నట్లు సీఐఐ తెలియచేసింది.

ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో తాత్కాలిక వసతి కోసం ప్రత్యేక గుడారాలను సిద్ధం చేసి, అంచెలంచెల

స్థాయిల్లో ధరలు కూడా పెట్టింది. ఒక్కో వసతికి రోజుకు వెయ్యి రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకూ ధరలు పెట్టారు. వాటిల్లో వసతులు సైతం అదే స్థాయిలో ఉన్నాయి.


/> #dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #CII  #kumbh mela  #revenue  #Uttara pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam