DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెలాఖరు లో విశాఖ కు హిందూ టైగర్ రాజాసింగ్ రాక?

*చిల్డ్రన్ ఎరీన లో మేధావులతో ముఖాముఖీ ఏర్పాటు.*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2024 : (డి ఎన్ ఎస్):* ఉత్తరాదిన విస్తృతంగా సాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రసరింపచేసేందుకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా హిందూ టైగర్, గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్

ఈనెలాఖరు లో విశాఖ నగరానికి రానున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాది కి చెందిన కుటుంబాలు అధికంగా ఉన్న విశాఖపట్నం లోక్ సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాది ప్రజలను మరింత ఉత్తేజపరిచేందుకు రాజాసింగ్ ను విశాఖ నగరం లో వీరందరితోనూ ముఖాముఖీ జరిపేందుకు అధిష్టానం పంపుతోంది.

ప్రధానంగా పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, యువతి యువకులతో భారీ సమావేశం నిర్వహించనున్నరు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున, ఆంధ్ర ప్రదేశ్ నుంచి కనీసం 7 లోక్ సభ సభ్యులను సొంతంగా గెలిపించుకునేందుకు బీజేపీ అధిష్టానం దృఢ నిశ్చయంతో ఉంది. ఇప్పడికే ప్రజల్లో ప్రజా పోరు, పల్లె నిద్ర లు, వికసిత భారత్ పేరిట

క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 
పట్టాన ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు సమాజంలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖులతో మహా నగర సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 

త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డా

తదితరులు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రచార సభల్లో పాల్గొనేనున్నారు. ఇన్నాళ్లు స్తబ్దత గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కమల వికాసం జరుగనుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam