DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మండా సుధారాణికి జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు ప్రదానం

*విశాఖ కు దక్కిన అత్యున్నత గౌరవం : కళాభారతి రాంబాబు* 

*(DNS Report: ఇదీ రాజకీయం, Ganesh Reddy BVS)*

విశాఖపట్నం/ఢిల్లీ , మార్చి 06, 2024 : (డి ఎన్ ఎస్):* కర్ణాటక సంగీతం లో ఎనలేని సేవచేసిన విశాఖ పట్నం సంగీత గురువు సంగీత సుధానిధి మండా సుధారాణి కి జాతీయ సంగీత నాటక అకాడెమీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అందించారు. బుధవారం దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమం లో భారత రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని సుధారాణి కి అందించారు. 2022  పురస్కారాల విభాగంలో వీరి ఎంపిక జరిగింది. వివిధ రంగాల్లో మొత్తం 94 మందికి ఈ పురస్కారాలను అందించారు. 2022 సంగీత విభాగం లో 12 మందికి ఈ పురస్కారం లభించింది. 
విశాఖపట్నం కు చెందిన సుధారాణి ప్రముఖ సంగీత

విద్వాన్ ఇవటూరి విజయేశ్వర వారు శిక్షణలో తర్ఫీదు పొందారు. విశాఖపట్నం లో స్థిరపరిదిన ఈ  ఏ టాప్ గ్రేడ్ కళాకారిణి  దశాబ్దాల కాలంగా కర్ణాటక సంగీతం లో సాధన చేయడమే కాక, చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దారు. వీరి కుమార్తె శృతి జాతీయ స్థాయి పురస్కారం పొందిన కళాకారిణి.

విశాఖ కు దక్కిన

అత్యున్నత గౌరవం : రాంబాబు 

విశాఖ సంగీత కళాకారిణి కి భారత రాష్ట్రపతి చే అత్యున్నత పురస్కారం లభించడం యావత్ విశాఖ నగరానికి దక్కిన అత్యున్నత గౌరవం అని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) తెలిపారు. సంగీత గురువు దక్కిన ఈ గౌరవం పట్ల సంగీత అభిమానులు, కళాకారులూ అభినందనలు

తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam