DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాలు సిఏఏ ని వ్యతిరేకించడం రాజ్యాంగ ఉల్లంఘనే: అన్నామలై 

*సీఎం పదవికి రాజీనామా చేసి ప్రసంగాలు చెయ్యాలి: తమిళ సింగం*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం / చెన్నై, మార్చి 13 , 2024 : (డి ఎన్ ఎస్):* రాజ్యాంగ పరమైన పదవుల్లో ఉన్నవాళ్లు సిఏఎ ( పౌరసత్వ సవరణ చట్టం) ను వ్యతిరేకించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, అది రాజ్యాంగ ఉల్లంఘనే అని  బీజేపీ తమిళనాడు

అధ్యక్షులు కె. అన్నామలై ప్రకటించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. భారత దేశ పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, దాన్ని వ్యతిరేకించే అర్హత రాష్ట్ర ప్రభుత్వ పరిధికాదన్నారు. ఈ విషయం భారత రాజ్యాంగంలోని ప్రకటించారన్నారు. కేంద్ర

ప్రభుత్వం తీసుకున్న సిఏఎ నిర్ణయాన్ని ఖఛ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు. సిఏఎ ను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనన్నారు. రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న తమిళనా నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సీఏఎ ను అమలు చెయ్యమని, ప్రకటించడం రాజ్యాంగం  ఉల్లంఘనే అవుతుందన్నారు. తన పదవికి రాజీనామా చేసి, రాజకీయ ప్రకటనలు

చేసుకోవచ్చ్చన్నారు. 
సీఏఎ ప్రకారం ఈ దేశంలో తగిన అర్హతలు ఉన్న ఎవ్వరి పౌరసత్వాన్ని రద్దు చేయడం ఉందన్నారు. ప్రతిపక్షాలు వికృతంగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయన్నారు. కళ్ళు మూసుకున్న పిల్లి కి లోకం అంతా చీకటిగానే కనిపించినట్టు, స్టాలిన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. స్టాలిన్, ఇతర

ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలను తగిన ఆధారాలతో చూపించాలని డిమాండ్ చేసారు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు తగిన భద్రతా కల్పిస్తూ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు. 2014 డిసెంబర్ 31 కు ముందు ఈ దేశాల నుంచి భారత్ కు వచ్చి, శరణార్థులుగా ఉన్న వారికి ఈ చట్టం ద్వారా పౌరసత్వం

లభిస్తుందన్నారు. 2022 నాటికి 1412 మందికి ఈ చట్టం ద్వారా పౌరసత్వం ఇవ్వడం జరిగిందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam