DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో పొత్తు పార్టీల్లోనే సభ్యుల  తార్ మార్ తక్కిడ మార్.  

ముళ్ళపూడి రేణుక అటు- బైరెడ్డి శబరీ ఇటు. .

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం / విజయవాడ, ఫిబ్రవరి 16, 2024 (డి ఎన్ ఎస్):* ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య సభ్యుల మార్పు ఉంటుంది. విచిత్రంగా ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తుల్లో ఉన్న తెలుగుదేశం, బీజేపీ ల మధ్య సభ్యుల పార్టీల మార్పు సంచలనంగా మారింది.

ఇన్నాళ్లు బీజేపీ యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ బైరెడ్డి శబరీ టీడీపీ లోకి చేరగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేసిన ముళ్ళపూడి రేణుక బీజేపీ లో చేరారు. 
అయితే పొత్తుల్లో ఉన్న పార్టీల మధ్య సభ్యుల మార్పు పార్టీల మధ్య అంతరాన్ని బహిర్గతం చేస్తోంది. ఒక స్థానం నుంచి ఎన్నికల్లో ఆశించిన చోటు నుంచి

టికెట్ రాకపోతే. .కేవలం టికెట్ కోసమే పార్టీలు మారే నైతికత సభ్యుల్లో నెలకొంది. శబరీ బీజేవైఎం లో సభ్యురాలిగా ఉండడంతో ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె తండ్రి రాజశేఖర్ మంత్రాంగం తో టీడీపీ లో చేరి ఎంపీ టికెట్ పెట్టేసారు. దీంతో ప్రజాదరణ ఉన్న ఆ ఒక్క సభ్యురాలు కూడా బీజేపీ నుంచి బయటకు

వెళ్లిపోయారు. 

ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మునిసిపల్ చైర్ పర్సన్ గా చేసిన ముళ్ళపూడి రేణుక గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నా. .కుటుంబానికి ప్రజాదరణ ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశం. దీంతో తన సామాజిక వర్గానికే చెందిన దగ్గుబాటి పురందేశ్వరి సూచనల మేరకు భారీ సంఖ్యలో అభిమానులతో కలిసి భారతీయ జనతా పార్టీలో

చేరారు. ఈమె రాకతో బీజేపీ లో కొంత జోష్ వచ్చినా. . అది ఏమేరకు పార్టీ కి ఉపయోగ పడుతోందో తెలియని అంశం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam