DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ ర్యాగింగ్ మామూలుగా లేదు. కాంగ్రెస్ 42 కే పరిమితా?

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, మార్చి 18, 2024 (డి ఎన్ ఎస్):* గత దశాబ్ద కాలంగా దేశ, విదేశాల్లో తన హవా తో విజృంభిస్తున్న నరేంద్ర మోడీ తన ప్రణాళికతో ప్రతిపక్షాలను పేరు చెప్పకుండానే  ర్యాగింగ్ చేస్తున్నట్టు గానే కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు తెలియచేస్తున్నారు. దేశంలోని అన్ని సర్వే సంస్థలు

బీజేపీ కి ఇన్ని సీట్లు వస్తాయి, మోడీ ప్రభావం ఇంత ఉంది అని చెప్తున్నాయి తప్ప. .కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ కు కొమ్ము కాసిన సంస్థలకు ఈ విషయం ఏమాత్రం మింగుడు పడడం లేదు. ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ పై చేస్తున్న వ్యాఖ్యలను సైతం మోడీ తనకు అనుకూలంగా మార్చుకుని

ఎటువంటి ప్రత్యక్ష విమర్శ కూడా చేయకుండానే వాళ్ళని ర్యాగింగ్ చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నారు. 
మోడీ కి పెళ్లి, కుటుంబం లేదని చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలంతా మోడీ కుటుంబమే అంటూ ప్రతి సభలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు తమది మోడీ కుటుంబం అంటూ వైరల్ చేస్తున్నారు. 
ఇక కాంగ్రెస్

చేసే ప్రతి తప్పిదాన్ని తనకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు. ప్రజల్లో అత్యంత ప్రజాదరణ కల్గిన నాయకునిగా నిలిచారు. 

భారత చరిత్ర లోనే కాంగ్రెస్ అతి తక్కువ సంఖ్యకు పడిపోనుందనే ప్రచారం ఈ సారి సాగుతోంది. సర్వే సంస్థలు చేసిన విచారణలో కాంగ్రెస్ కి ఒంటరిగా 22 నుంచి 43 మధ్య మాత్రమే వచ్చే అవకాశం ఉందని

 తెలియచేస్తున్నాయి. అయితే తన పేరు బయట పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. 

భారత చరిత్ర లోనే కాంగ్రెస్ అతి తక్కువ సంఖ్యకు పడిపోనుందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 లో 44 సీట్లు తెచ్చుకుంది. 2019  లో 54 సీట్లు సాధించింది. ఈ 2024 ఎన్నికల్లో అంతకంటే తక్కువగా వస్తాయనే వార్తల్ని ప్రపంచ ప్రఖ్యాత కాంగ్రెస్ నేతలు

జీర్ణించుకోలేక పోతున్నారు. స్వాతంత్యాన్ని మేమె తెచ్చామని, 140 ఏళ్ళ పురాతన పార్టీ మాది అని చెప్పుకునే కాంగ్రెస్ తిరోగమనంలో ఉన్న పార్టీ కూడా మాదే అనే చెప్పుకునే స్థాయికి మోడీ తీసుకు వచేశారనడం అతిశయోక్తి కాదు.       

ఇండీ కూటమి కి వచ్చే సంఖ్యా చెబుతున్నారే తప్ప. . .కాంగ్రెస్ కి ఒంటరిగా ఎన్ని సీట్లు వస్తాయో

ప్రకటించేందుకు మీడియా సంస్థలు, సర్వ్ సంస్థలు కూడా నోరు విప్పడం లేదు. 

కేరళ, బెంగాల్ , బీహార్ , ఉత్తర ప్రదేశ్ ల్లో తప్ప మిగిలిన చోట్ల ఇండి కూటమి లేదు. వీళ్ళని మినహాయిస్తే. .కాంగ్రెస్ కి 22 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలియచేస్తున్నాయి.
తూర్పు, ఉత్తర, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి మహా అయితే 5

సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని తెలియచేస్తున్నాయి.
పంజాబ్ నుంచి 1, ఛత్తీస్ ఘర్ నుంచి 1 , ఝార్ఖండ్ నుంచి 1 సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉంది
తెలంగాణ లో 10 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. కేరళ నుంచి అతి ఎక్కువ గా అయితే  10  సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని, కర్ణాటక లో 4 సీట్లు గెలవ వచ్చు అని తెలియ చేస్తున్నాయి.
ఏది ఏమైనా. .సుమారు 70

ఏళ్ళ పాటు దేశాన్ని పరిపాలించిన పార్టీ ఈ ఎన్నికల తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ కన్నా క్రింద స్థాయి కి దిగజారిన ఆశ్చర్యపోనక్కరలేదు.

దీన్నే పొలిటికల్ ర్యాగింగ్ అంటారేమో అనే భావన రాజకీయ విశ్లేషకులకు కలుగుతోంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam