DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నామినేషన్ వేసాం ఓటేసి ఆశీర్వదించండి:తమిళసింగం అన్నామలై 

*తమిళనాట సమరభేరి, కాషాయ మయం గా మారిన కోయంబత్తూర్*   

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

చెన్నై / విశాఖపట్నం, మార్చి 27 , 2024 : (డి ఎన్ ఎస్):* దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న తమిళనాట ఎన్నికల సమర భేరి ఆరంభమయ్యింది.తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళ సింగం కె. అన్నామలై  కోయంబత్తూర్ లో లోక్ సభ

స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. మొదటి దశ లో జరుగుతున్న ఎన్నికల్లో అన్నామలై పోటీ లో ఉండడంతో అత్యంత ప్రాధాన్యత సాధించింది. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ పాటి కి తన దరఖాస్తును అందించారు. అంతకు ముందు కోయంబత్తూర్ లోని కోయిల్అమ్మన్ దేవాలయంలో ప్రార్ధనలు చేసి, భారీ ర్యాలీగా రిటర్నింగ్

అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఈయన వెంట జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, కోయంబత్తూర్ దక్షిణ ఎమ్మెల్యే వంటి శ్రీనివాసన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దురైస్వామి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం అన్నామలై మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

ఆశీస్సులతో, తమిళనాడు ప్రజల ప్రేమ మరియు మద్దతుతో, రానున్న లోక్ సభ ఎన్నికలలో కోయంబత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నా నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. 

కోయంబత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాలు, సమగ్ర అభివృద్ధిని తీసుకురావడం, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు మరియు

కోయంబత్తూరు పర్యావరణాన్ని పునరుద్ధరించడం మా ప్రధాన లక్ష్యం అన్నారు. 
భారత్ ను విశ్వ గురు స్థానంలో నిలిపిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆశయ సాధన ఇస్ బార్  400 పార్ లక్ష్యం లో కోయంబత్తూర్ కు స్థానం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సాధన లో పార్టీలకతీతంగా కోయంబత్తూరుతో సహా తమిళనాడు ప్రజలందరూ మన భారత ప్రధానికి

తమ మద్దతును ఖచ్చితంగా తెలియజేస్తారని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam